ap: ఏపీ బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. ఛైర్ పర్సన్ గా పురంధేశ్వరి

  • రానున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తం 
  • 11 మందితో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ 
  • కన్వీనర్ గా ఐవైఆర్ కృష్ణారావు

రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతంపై ఏపీ బీజేపీ దృష్టి సారించింది. ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. ఈ క్రమంలో మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీలో కీలక నాయకురాలు పురంధేశ్వరిని మేనిఫెస్టో కమిటీ ఛైర్ పర్సన్ గా నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్టారావును కన్వీనర్ గా నియమించారు.

కమిటీ సభ్యులు వీరే:

  • పురంధేశ్వరి - ఛైర్ పర్సన్
  • ఐవైఆర్ కృష్ణారావు - కన్వీనర్
  • పి.విజయబాబు
  • పీవీఎన్ మాధవ్
  • దాసరి శ్రీనివాసులు
  • షేక్ మస్తాన్
  • పాక సత్యనారాయణ
  • కె.కపిలేశ్వరయ్య
  • పి.సన్యాసి రాజు
  • సుధీష్ రాంబొట్ల
  • డీఏఆర్ సుబ్రహ్మణ్యం

More Telugu News