nimmakuro: నిమ్మకూరులో ‘యన్.టి.ఆర్’ చిత్రం యూనిట్.. తల్లిదండ్రులకు నివాళులర్పించిన బాలకృష్ణ

  • ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు
  • నివాళులర్పించిన బాలయ్య, విద్యాబాలన్
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కల్యాణ్ రామ్

కృష్ణాజిల్లాలోని నిమ్మకూరుకు ‘యన్.టి.ఆర్’ చిత్రం యూనిట్ చేరుకుంది. ముందుగా అక్కడ తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ చిత్రంలో బసవతారకం పాత్ర పోషిస్తున్న నటి విద్యాబాలన్ కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, నటుడు నందమూరి కల్యాణ్ రామ్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


More Telugu News