kcr: తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

  • కొత్త జిల్లాలుగా ములుగు, నారాయణపేట్
  • ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి
  • గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం

తెలంగాణ పల్లెల రూపు రేఖలను మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నద్ధమయ్యారు. పచ్చదనం, పరిశుభ్రత ఉట్టిపడేలా గ్రామాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశించారు.

అంతేకాదు, మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ములుగు, నారాయణపేట్ లను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు, దేశం బాగుంటాయని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాలని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన వెంటనే గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.

More Telugu News