Hyderabad: మైత్రీవనం మెట్రో స్టేషన్ లో దారుణం.. కిందకు దూకేసి యువకుడు ఆత్మహత్య!

  • హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
  • వివరాలు తెలియరాలేదన్న పోలీసులు
  • ప్రమాదాలపై అధికారుల విస్మయం

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. అమీర్ పేట సమీపంలోని మైత్రీవనం మెట్రో స్టేషన్ పై నుంచి ఓ యువకుడు దూకేశాడు. మెట్రో స్టేషన్ ప్రాంగణంలోకి వెళ్లిన సదరు యువకుడు సారథి స్టూడియోవైపు ఒక్కసారిగా దూకేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతడిని అధికారులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించామని పేర్కొన్నారు. మెట్రో స్టేషన్ లో ఈ తరహా ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ గత మంగళవారం కొత్తపేటలోని విక్టోరియా మొమోరియల్ మెట్రోస్టేషన్ నుంచి దూకేసింది.

అయితే స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు.

More Telugu News