Kurnool District: చంపిన తర్వాత కూడా కసి తీరక గుండెను పెకలించి తీసుకెళ్లారు!

  • కర్నూలు జిల్లాలో ఘటన
  • రౌడీషీటర్ చెన్నయ్య హత్య
  • పాత కక్షలే కారణమంటున్న పోలీసులు

కర్నూలు జిల్లాలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. ఓ రౌడీ షీటర్ ను కిరాతకంగా హత్య చేసినప్పటికీ తమ కసి తీరకపోవడంతో అతని గుండెను పెకలించి తీసుకెళ్లారు. ఇక్కడి సాయిబాబాగిరి ప్రాంతంలో రౌడీ షీటర్ చెన్నయ్య ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇంటి నుంచి బయలుదేరిన చెన్నయ్య.. తిరిగి రాలేదు. తెల్లవారుజామున తుంగభద్ర నదీతీరంలో ఓ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చనిపోయింది చెన్నయ్యేనని గుర్తించారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాత కక్షల నేపథ్యంలోనే చెన్నయ్యను దుండగులు హత్యచేసి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపామని వెల్లడించారు. దుండగులు చెన్నయ్య శరీరం నుంచి గుండెను పెకలించి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

More Telugu News