diwali: తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్

  • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు
  • చీకటి మీద వెలుగు సాధించిన విజయం దీపావళి
  • ప్రతి ఇంటా ఆనందాల కోటి కాంతులు నింపాలి

దీపావళి పండగ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ‘దీపావళి’ ప్రతీక అని పేర్కొన్నారు. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కోటి కాంతులు నింపాలని జగన్ ఆకాంక్షించారు.
 

More Telugu News