mohanlal: మోహన్ లాల్ 'ఒడియన్'కి స్టార్ హీరోల వాయిస్ ఓవర్

  • భారీ మలయాళ చిత్రంగా 'ఒడియన్'
  • విలక్షణమైన పాత్రలో మోహన్ లాల్ 
  • మూడు భాషల్లో డిసెంబర్లో విడుదల

మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 'ఒడియన్' నిర్మితమైంది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మోహన్ లాల్ మృగ లక్షణాలు కలిగిన వ్యక్తిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రలో ఆయన పగలు ఒకలా .. రాత్రి మరొకలా కనిపించనున్నాడని అంటున్నారు. ప్రకాశ్ రాజ్ .. మంజు వారీయర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, మలయాళంతో పాటు తెలుగు .. తమిళ భాషల్లోను విడుదల చేయనున్నారు.

మలయాళ వెర్షన్ కి మమ్ముట్టి వాయిస్ ఓవర్ చెబుతారట. ఇక తమిళంలో రజనీకాంత్ తోను .. తెలుగులో ఎన్టీఆర్ తోను వాయిస్ ఓవర్ చెప్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు భాషల్లోని ట్రైలర్స్ ను ఈ ముగ్గురు హీరోలతోనే రిలీజ్ చేయిస్తారట. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నట్టుగా చెబుతున్నారు. మోహన్ లాల్ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News