Tamilnadu: ఆ 18 మంది ఎమ్మెల్యేలు అనర్హులే!: కీలక తీర్పిచ్చిన మద్రాస్ హైకోర్టు

  • టీటీవీ దినకరన్ కు మద్రాస్ హైకోర్టు షాక్
  • 18 మంది ఎమ్మెల్యేలపై తీర్పు వెలువరించిన న్యాయమూర్తి
  • పళనిస్వామికి పెద్ద ఊరటే

శశికళ బంధువు, అన్నాడీఎంకే బహిష్కృత టీటీవీ దినకరన్ కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తమిళనాడులో అనర్హతను ఎదుర్కొంటున్న 18 మందిపై కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ ఎమ్మెల్యేలు అనర్హులేనని తేల్చి చెప్పారు. అనర్హత వేటును సమర్థించిన న్యాయస్థానం, ఎమ్మెల్యేలంతా పదవీచ్యుతులేనని తెలిపింది.

ఈ తీర్పు ముఖ్యమంత్రి పళనిస్వామికి పెద్ద ఊరటే. కాగా, అనర్హత చెల్లబోదని తీర్పు వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న దినకరన్, తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించిన సంగతి తెలిసిందే.

More Telugu News