chaitu: ఆసక్తిని పెంచుతోన్న 'సవ్యసాచి' ట్రైలర్

  • చైతూ హీరోగా 'సవ్యసాచి'
  • ప్రతినాయకుడిగా మాధవన్ 
  • ఆకట్టుకుంటోన్న డైలాగ్స్

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందింది. ప్రతినాయకుడిగా మాధవన్ నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. కామెడీ .. ఎమోషన్ .. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది.

"వాణ్ని చూస్తుంటే పద్మవ్యూహంలో అభిమాన్యుడిలా ఉన్నాడు కదూ .. " అని  హీరోను ఉద్దేశించి ప్రతినాయకుడు పక్కనే వున్న వ్యక్థితో అంటే, 'మీది పద్మవ్యూహమే సార్ .. కానీ ఆయన అభిమన్యుడిలా కాదు .. అర్జునుడులా వున్నాడు' అని ఆయన అనే ఈ డైలాగ్ బాగా పేలింది. 'చావైనా నిన్ను చేరాలంటే అది నీ ఎడమ చేయి దాటి రావాలి' అంటూ రావు రమేశ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునే విధంగా వుంది. ఈ సినిమాలో చైతూ అక్కగా భూమిక కీలకమైన పాత్రలో కనిపించనుందనే సంగతి తెలిసిందే.

More Telugu News