Raviteja: 'టైమ్ మిషన్' నేపథ్యంలో రవితేజ మూవీ

  • వీఐ ఆనంద్ తో రవితేజ 
  • కథానాయికగా నభా నటేశ్ 
  • డిసెంబర్లో సెట్స్ పైకి  

ప్రస్తుతం రవితేజ .. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. డిఫరెంట్ లుక్స్ తో రవితేజ కనిపించనుండటం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా తరువాత దర్శకుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నాడు.

విభిన్నమైన కథా వస్తువులను ఎంచుకుని, ఆ కథలను ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడం వి.ఐ. ఆనంద్ ప్రత్యేకత. అలాంటి ఆయన ఈ సారి 'టైమ్ మిషన్' నేపథ్యంలోని కథను సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం. గతంలో టైమ్ మిషన్ నేపథ్యంలో 'ఆదిత్య 369' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కథ మరో కోణంలో కొనసాగుతుందని చెబుతున్నారు. నభా నటేశ్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాను, డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. మొత్తానికి వి.ఐ.ఆనంద్ మరో కొత్త ప్రయోగం చేస్తున్నాడన్న మాట.   

More Telugu News