sudher babu: 'నన్ను దోచుకుందువటే' నా కెరియర్ కి హెల్ప్ అవుతుంది: నాభా నటేశ్

  • ఈ సినిమాలో మంచి పాత్ర పడింది
  • అందరికీ నచ్చే పాత్ర అవుతుంది 
  • అది నా దృష్టంగా భావిస్తున్నాను

తెలుగు తెరకి కొత్తగా పరిచయమవుతోన్న కథానాయికల జాబితాలో 'నాభా నటేశ్' పేరు మొదటివరుసలో కనిపిస్తోంది. రవిబాబు దర్శకత్వం వహించిన 'అదుగో' సినిమాలో తొలిసారిగా నటించినప్పటికీ, ఆమె నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమా ముందుగా ఈ నెల 21వ తేదీన రిలీజ్ అవుతోంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను సరదాగా సందడి చేసే పాత్రలో కనిపిస్తాను. బలమైన భావోద్వేగాలను సైతం పలికించే పాత్ర ఇది. ఈ తరహా పాత్రను పోషించే ఛాన్స్ లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అన్నివర్గాల ప్రేక్షకులకు నా పాత్ర కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. నా పాత్రకి అభినందనలు దక్కితే అందుకు కారకులు దర్శకుడు ఆర్ఎస్ నాయుడు గారు .. సుధీర్ బాబు అవుతారు. అందరికంటే ముందుగా నేను ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా నా కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందనే నమ్మకం బలంగా వుంది" అని చెప్పుకొచ్చింది.  

More Telugu News