sudheer babu: ఈ దర్శకుడికి ముందుగా నేను నో చెప్పాను: హీరో సుధీర్ బాబు

  • బౌండ్ స్క్రిప్ట్ పూర్తిగా చదివాను 
  • కథ నచ్చడం వల్లనే నిర్మాతగా మారాను 
  • మరో హిట్ ఖాయమనిపిస్తోంది  

మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విలక్షణమైన పాత్రలను చేస్తూ సుధీర్ బాబు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'నన్ను దోచుకుందువటే' సినిమా రూపొందింది. ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాభా నటేశ్ కథానాయికగా నటించింది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ ఛానల్ తో సుధీర్ బాబు మాట్లాడాడు.

"ఒక రోజున ఆర్.ఎస్. నాయుడు నా దగ్గరికి వచ్చి కథ వినిపించాడు .. కానీ రిజెక్ట్ చేసి పంపించేశాను. ఆ తరువాత డైలాగ్ వెర్షన్ తో .. ట్రీట్మెంట్ తో ఒక బౌండ్ స్క్రిప్ట్ వేరే వ్యక్తి ద్వారా నా దగ్గరికి వచ్చింది. ఆ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చడంతో, హీరోగా చేయడమే కాకుండా నేనే నిర్మించాలని నిర్ణయించుకున్నాను. దర్శకుడిని పిలిపించమంటే .. ముందుగా నాకు కథ చెప్పిన ఆర్.ఎస్. నాయుడుగారే రావడంతో ఆశ్చర్యపోయాను. కథకి ఆయన ఆ రూపాన్ని తీసుకురావడంతో నాకు నమ్మకం కలిగింది. అలా ఈ కథ సెట్స్ పైకి వెళ్లింది .. నాకు మరో హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News