sudheer babu: 'నన్నుదోచుకుందువటే' టీమ్ ప్రీ రిలీజ్ టూర్

  • సుధీర్ బాబు తాజాగా చిత్రంగా 'నన్నుదోచుకుందువటే'
  • రెండు రోజుల పాటు ప్రీ రిలీజ్ టూర్ 
  • వచ్చేనెల 13వ తేదీన విడుదల      

సుధీర్ బాబు హీరోగా ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో 'నన్ను దోచుకుందువటే' సినిమా రూపొందింది. నాభా నటేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వినాయక చవితి కానుకగా వచ్చేనెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ టూర్ ను ప్లాన్ చేసింది. ఈ నెల 25 .. 26వ తేదీలలో ఈ టూర్ ను జరపనున్నారు.

 ప్రమోషన్ లో భాగంగా 25వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు 'రాజమండ్రి'లోని ఐ.ఎస్.టి.ఎస్ కాలేజ్ కి ఈ సినిమా టీమ్ చేరుకోనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు 'కాకినాడ'లోని కెఐఈటీ ఉమెన్స్ కాలేజ్ లో అభిమానులను కలవనున్నారు. ఇక 26వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం - అరసవిల్లి ఆలయానికి చేరుకోనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి విశాఖపట్నంలోని సిఎంఆర్ మాల్ లో సందడి చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు.      

More Telugu News