pope francis: కేరళను ఆదుకోవాలంటూ పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్

  • వాటికన్ సిటీలో ప్రార్థనల సమయంలో పోప్ విన్నపం
  • ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ప్రార్థించాలన్న పోప్
  • కేరళ ప్రజలను ఆదుకుంటామన్న ఫ్రాన్సిస్

జలదిగ్బంధంతో అపార నష్టాన్ని మూటగట్టుకున్న కేరళను ఆదుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారు. తాజాగా దెబ్బతిన్న కేరళను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. వాటికన్ సిటీలో ఈరోజు జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు విన్నవించారు. వరద బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ప్రార్థనలు నిర్వహించాలని ప్రార్థనల్లో పాల్గొన్నవారిని ఫ్రాన్సిస్ కోరారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు క్యాథలిక్ చర్చి అన్ని చర్యలను తీసుకుంటోందని ఈ సందర్భంగా పోప్ తెలిపారు.

More Telugu News