samantha: ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'యూ టర్న్' ట్రైలర్

  • థ్రిల్లర్ నేపథ్యంలో 'యూ టర్న్'
  • ప్రధాన పాత్రలో సమంత 
  • సెప్టెంబర్ 13వ తేదీన విడుదల

సమంత ప్రధాన పాత్రగా .. థ్రిల్లర్ నేపథ్యంలో 'యూటర్న్' సినిమా నిర్మితమైంది. ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ .. భూమిక ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి పవన్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించాడు. కన్నడలో ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఈయనే. అక్కడ హిట్ కావడం వలన రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. కథ అంతా కూడా 'ఆర్కే పురం' ఫ్లై ఓవర్ పై జరిగిన యాక్సిడెంట్ చుట్టూ తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఓ వైపున ఆ ప్రమాదం విషయంలో కొన్ని ఆధారాల కోసం సమంత ప్రయత్నిస్తూ వుంటుంది .. మరో వైపున పోలీస్ ఆఫీసర్స్ ఆమెను అనుమానిస్తుంటారు. ఆసక్తికరమైన మలుపులు .. ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలతో ఈ సినిమా కొనసాగుతుందనే విషయం స్పష్టమవుతోంది. 

More Telugu News