samanta: థ్రిల్లర్ మూవీగా 'యూటర్న్' .. త్వరలో టీజర్ రిలీజ్

  • సమంత ప్రధాన పాత్రగా 'యూటర్న్' 
  • ఈ నెల 17వ తేదీన టీజర్ రిలీజ్ 
  • సెప్టెంబర్ 13వ తేదీన సినిమా విడుదల  

కన్నడలో 2016లో వచ్చిన 'యూ టర్న్' మూవీ అక్కడ భారీ విజయాన్ని సాధించింది. దర్శకుడిగా ఈ సినిమా పవన్ కుమార్ కి మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి కూడా పవన్ కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ .. భూమిక కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగనున్న ఈ సినిమా నుంచి, ఈ నెల 17వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ తో సినిమాపై భారీగా అంచనాలను పెంచాలనే ఉద్దేశంతో వున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుందనీ .. సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తూ, అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శకుడు పవన్ కుమార్ అంటున్నాడు.   

More Telugu News