nagachaitanya: గోవాలో 'శైలజా రెడ్డి అల్లుడు' డ్యూయెట్

  • ఇప్పటికే టాకీ పార్టు పూర్తి 
  • కొనసాగుతోన్న పాట చిత్రీకరణ 
  • త్వరలోనే రానున్న టీజర్  

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇప్పటికే టాకీపార్టును పూర్తి చేసుకుంది. ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉండగా .. ప్రస్తుతం ఆ పాటను 'గోవా'లో చిత్రీకరిస్తున్నారు. మూడు రోజులుగా కొనసాగుతోన్న పాట చిత్రీకరణ ఈ రోజుతో పూర్తి కానున్నట్టు చెబుతున్నారు.

ఈ పాట చాలా రొమాంటిక్ గా ఉంటుందనీ .. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఆమె కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఈ నెల 31న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన 10వ తేదీ నుంచి ప్రచార కార్యక్రమాలను మొదలుపెడతారట. టీజర్లు .. ట్రైలర్లు రిలీజ్ చేయడంతో పాటు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీస్థాయిలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.           

More Telugu News