rajendra prasad: నటుడిగా నా అనుభవాలను పుస్తకంగా తీసుకొస్తాను: రాజేంద్రప్రసాద్

  • చాలామందితో కలిసి పనిచేశాను 
  • విభిన్నమైన పాత్రలను పోషించాను 
  • ఈ తరం వారికి నా అనుభవాలు చెబుతుంటాను  

తాజాగా రాజేంద్రప్రసాద్ 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో పాల్గొన్నారు. "ఎన్టీఆర్ నుంచి మొదలు పెట్టి విజయ్ దేవరకొండ వరకూ అంటే .. ఐదారు తరాల హీరోలతో ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ అనుభవాలను పుస్తక రూపంగా తెస్తే బాగుంటుంది కదా?'' అనే ప్రశ్న రాజేంద్ర ప్రసాద్ కి ఎదురైంది. ఆందుకాయన స్పందిస్తూ .. "ఇంతమంది ఆర్టిస్టులతో ఇన్ని రకాల పాత్రలను చేసే అదృష్టం బహుశా నాకు ఒక్కడికే దక్కిందని అనుకుంటున్నాను. వాళ్లంతా కూడా నా సీనియర్స్ కి సంబంధించిన విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకుంటూ వుంటారు.

షూటింగు విరామ సమయంలో నా అనుభవాలను వాళ్లందరికీ చెబుతూ వుంటాను. నా అనుభవాల్లో ఏ ఒక్కటి వాళ్లకి పనికొచ్చినా నాకు సంతోషమే. అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ నా అనుభవాలను గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. నా అనుభవాలకు పుస్తక రూపం తీసుకొస్తే బాగుంటుందనే మీ సూచనను నేను స్వీకరిస్తున్నాను. రాయడం నాకు అలవాటు లేదు కాబట్టి .. ఎవరినైనా నియమించుకుని ఆ పనిని పూర్తి చేస్తాను" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News