nagashourya: నాగశౌర్య హీరోగా కొత్త సినిమా ప్రారంభం

  • రాజేంద్ర దర్శకత్వంలో నాగశౌర్య
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  • ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్

తెలుగు తెరపై లవర్ బాయ్ గా సందడి చేస్తోన్న నాగశౌర్యకి .. యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఒక వైపున సొంత బ్యానర్ పై సినిమాలు చేస్తూ .. మరో వైపున ఇతర సినిమాలపైనా దృష్టి పెడుతున్నాడు. అలా సొంత బ్యానర్లో 'నర్తనశాల' రెడీ అవుతుండగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్లోను ఆయన ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు.

కథలో కొత్తదనం కారణంగా .. ఇంతవరకూ తాను ఈ తరహా పాత్రను చేయకపోవడం వల్లనే నాగశౌర్య ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ సినిమా ద్వారా రాజేంద్ర కొలుసు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కొంతసేపటి క్రితం ఈ ప్రాజెక్టును లాంచ్ చేశారు. ఆనంద్ ప్రసాద్ నిర్మించే ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది. హీరోయిన్ తో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

More Telugu News