DATTATREYA: బండారు దత్తాత్రేయ కుటుంబానికి సీఎం కేసీఆర్ సానుభూతి

  • దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతి పట్ల సంతాపం
  • నిన్న రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచిన వైష్ణవ్
  • దత్తాత్రేయకు ఒక కుమారుడు, ఒక కుమార్తె  

కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాాద్ ఎంపీ అయిన బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ (21) ఆకస్మికంగా మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వైష్ణవ్ నిన్న రాత్రి 10.45 గంటల ప్రాంతంలో తన ఇంట్లోనే భోజనం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణం విడిచిన విషయం విదితమే. వైష్ణవ్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ వైష్ణవ్ మృతి చెందడం పట్ల సంతాపం తెలిపారు. అలాగే, బండారు దత్తాత్రేయ కుటుంబానికి సానుభూతి కూడా తెలియజేశారు. దత్తాత్రేయకు ఇద్దరు సంతానం. వారిలో ఒకరు వైష్ణవ్ కాగా, మరొకరు కుమార్తె విజయలక్ష్మి.

More Telugu News