kumara swamy: తుది నిర్ణయం ప్రకటించిన కుమారస్వామి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కి లేఖ

  • తన తండ్రితో చర్చించిన కుమారస్వామి
  • గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతూ లేఖ
  • కాంగ్రెస్‌ మద్దతును అంగీకరిస్తున్నట్లు వ్యాఖ్య

బెంగళూరు పద్మనాభనగర్‌లో తన తండ్రి దేవెగౌడతో భేటీ అయి చర్చించిన తరువాత జేడీఎస్‌ నేత కుమారస్వామి తుది నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ మద్దతు లభించడంతో తమ రాష్ట్ర గవర్నర్‌కు కుమారస్వామి ఓ లేఖ రాశారు. ఈ రోజు సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య గవర్నర్‌ను కలిసేందుకు తమకు అపాయింట్‌మెంట్‌ కావాలని, తాము కాంగ్రెస్‌ మద్దతును అంగీకరిస్తున్నామని ఆ లేఖలో కుమారస్వామి పేర్కొన్నారు.       

More Telugu News