mahanati: 'మహానటి' సినిమాపై రాజమౌళి స్పందన

  • నాగ్ అశ్విన్, స్వప్నలు చాలా గొప్పగా తీశారు
  • సావిత్రికి కీర్తి సురేష్ జీవం పోశారు
  • దుల్కర్ సల్మాన్ కి నేను అభిమానిగా మారాను

దేశం గర్విచదగ్గ నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి' సినిమా నేడు భారీ ఎత్తున విడుదలై... ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. మహానటి చరిత్రను అద్భుతంగా తెరకెక్కించారంటూ సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాపై దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు.

గొప్ప చిత్రాన్ని తీశారంటూ నాగ్ అశ్విన్, స్వప్నలను అభినందించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరు సూపర్బ్ అంటూ కితాబిచ్చారు. తన జీవితంలో తాను చూసిన అత్యద్భుత పర్ఫామెన్స్ లలో ఈ చిత్రంలో కీర్తి సురేష్ ది ఒకటని చెప్పారు. మహానటికి ఆమె మళ్లీ జీవం పోశారని కితాబిచ్చారు. దుల్కర్ సల్మాన్ నటన అద్భుతంగా ఉందని... అతనికి తాను ఇప్పుడు ఫ్యాన్ గా మారిపోయానని ట్వీట్ చేశారు. 

More Telugu News