Siddaramaiah: ‘ప్రియమైన కర్ణాటక ప్రజలారా..!’ సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర ట్వీట్

  • బీజేపీతో మనం లెక్కలు నేర్చుకుందాం 
  • తెలివిగా ఎన్నుకోండి .. యడ్డీ వద్దు
  • అనివీతిపరుల చేతుల్లో రాష్ట్రాన్ని పెడదామా?

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మళ్లీ విజయం కట్టాబెట్టాలని కోరుతూ సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర ట్వీట్ చేశారు. అవినీతి ఆరోపణల కేసులలో జైలుకెళ్లొచ్చిన బీజేపీ నేత యడ్యూరప్పను, ఆ గ్యాంగ్ ను ఈ ఎన్నికల్లో గెలిపించవద్దని కోరుతూ ఈ ట్వీట్ చేశారు. అయితే, ఈ విషయాన్ని తనదైన శైలిలో సిద్ధరామయ్య చెప్పారు.

‘ప్రియమైన కర్ణాటక ప్రజలారా,

బీజేపీతో మనం లెక్కలు నేర్చుకుందాం :

జైలు పక్షి యడ్డీ =1
అపఖ్యాతి రెడ్డి బ్రదర్స్ = 2+1
శ్రీరాములు = 3+1
కట్టా సుబ్రమణ్యం = 4+1
కృష్ణయ్య శెట్టి = 5+1
హర్తల్ హలప్పా = 6+1
రేణుకాచార్య = 7+1 ... రాష్ట్రాన్ని ఈ గ్యాంగ్ చేతుల్లో పెడదామా? తెలివిగా ఎన్నుకోండి ! యడ్డీ వద్దు’ అని సిద్ధరామయ్య కోరారు.

More Telugu News