Allu Arjun: ఇది ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ కాదు: 'నా పేరు సూర్య' దర్శకుడు

  • ఇది ఎన్టీఆర్ కి వినిపించిన కథ కాదు 
  • బన్నీ కోసం బయటికి తీసిన కథ 
  • ఎన్టీఆర్ కి చెప్పిన కథ ఆయనతోనే ఉంటుంది        

అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన 'నా పేరు సూర్య' ప్రపంచవ్యాప్తంగా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రదర్శించబడుతోన్న ప్రతి థియేటర్ దగ్గర భారీస్థాయిలో సందడి కనిపిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచి ఒక వార్త షికారు చేస్తోంది. గతంలో ఎన్టీఆర్ కి వినిపించిన కథనే, బన్నీతో వక్కంతం వంశీ చేశాడని చెప్పుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి దర్శకుడు వక్కంతం వంశీ స్పందించాడు. తాను ఎన్టీఆర్ కి వినిపించిన కథ వేరనీ .. ఆ కథకు .. ఈ కథకు సంబంధం లేదని చెప్పాడు. ఈ సినిమా నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ .. అల్లు అర్జున్ కోసం కథ అడిగినప్పుడు, తన స్టోరీ బ్యాంక్ లో నుంచి ఈ కథను బయటికి తీశానని అన్నాడు. ఎన్టీఆర్ కోసం అనుకున్న కథను సంతృప్తికరంగా తీర్చదిద్దవలసి ఉందనీ, ఆ కథను ఆయనతోనే చేస్తానని చెప్పుకొచ్చాడు.       

More Telugu News