samanta: 'యు టర్న్' కోసం పారితోషికం తీసుకోని సమంత!

  • షూటింగు దశలో 'యు టర్న్'
  • జర్నలిస్ట్ పాత్రలో సమంత 
  • కీలకమైన పాత్రలో భూమిక

ఆ మధ్య కన్నడలో విడుదలైన 'యు టర్న్' సినిమా అక్కడ మంచి లాభాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన సినిమాగా అక్కడి ప్రేక్షకులచే ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. కన్నడలో తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ రీమేక్ కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

 జర్నలిస్ట్ గా ఈ సినిమాలో సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా ఓ మాదిరి బడ్జెట్ తో రూపొందిస్తుండటం వలన, ముందుగా సమంత పారితోషికం తీసుకోవడం లేదట. సినిమా సక్సెస్ అయిన తరువాత లాభాల్లో వాటాను పొందేలా మాట్లాడుకుందని సమాచారం. ఈ తరహా అగ్రిమెంట్ పై సమంత సినిమా చేయడం ఇదే ఫస్టు టైమ్ అని అంటున్నారు. భూమిక .. ఆది .. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. 

More Telugu News