vishnu: 'సైరా'లో చేసే ఛాన్స్ వుంది: ప్రగ్యా జైస్వాల్

  • విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'
  • ఈ సినిమా ఆసాంతం నవ్విస్తుంది 
  • ఎన్ఆర్ ఐ పాత్రలో కనిపిస్తాను

విష్ణు కథానాయకుడిగా నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'ఆచారి అమెరికా యాత్ర' రూపొందింది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తాను ఎన్ ఆర్ ఐ పాత్రలో కనిపిస్తాననీ, సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ పడి పడి నవ్వడం ఖాయమని చెప్పింది.

ఈ సందర్భంలోనే ఆమె 'సైరా' ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ సినిమాలో తాను నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని చెప్పింది. 'సైరా'లో ముగ్గురు కథానాయికలు వుండనున్నట్టుగా ఆరంభంలోనే చెప్పారు. ఒక కథానాయికగా నయనతార నటిస్తోన్న సంగతి తెలిసిందే. మిగతా ఇద్దరు కథానాయికలలో ఒకరుగా ప్రగ్యా జైస్వాల్ చేయనుందా? లేదంటే కీలక పాత్ర ఏదైనా చేయనుందా? అనేది చూడాలి.      

More Telugu News