sai pallavi: నాగశౌర్యను నిజంగా బాధపెట్టి వుంటే సారీ చెప్పేస్తాను!: సాయిపల్లవి

  • నాగశౌర్య చాలా సైలెంట్ గా వుంటారు
  • అందువల్లనే నేను పెద్దగా మాట్లాడలేదు 
  • ఈ కారణంగానే అపార్థం చేసుకున్నారేమో

సాయిపల్లవి .. నాగశౌర్య ప్రధానమైన పాత్రలను పోషించిన తమిళ మూవీకి మొదట్లో 'కరు' అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ సినిమా పేరును 'దియా'గా మార్చారు. తెలుగులో ఈ సినిమాను 'కణం' పేరుతో ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మధ్య నాగశౌర్య  ఓ సందర్భంలో మాట్లాడుతూ .. సాయిపల్లవికి తలబిరుసు ఎక్కువనీ, ఆమె వలన షూటింగులో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పాడు.

ఈ విషయంపై తాజాగా సాయిపల్లవి స్పందించింది. 'నాగశౌర్య షూటింగ్ సమయంలో చాలా సైలెంట్ గా ఉండేవారు. ఆయనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను పెద్దగా మాట్లాడేదానిని కాదు. అందువలన ఆయన నన్ను అపార్థం చేసుకుని వుంటారు. ఈ సినిమా డబ్బింగ్ సమయంలో నాగశౌర్యకు ఫోన్ చేయాలని ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. కావాలనే నేను బాధపెట్టానని తాను భావిస్తే, సారీ చెప్పడానికి నేను సిద్ధంగా వున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.          

More Telugu News