nagashourya: సాయిపల్లవి హారర్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్

  • తమిళంలో 'కరు' మూవీ 
  • తెలుగులో 'కణం' పేరుతో 
  • ఈ నెల 27వ తేదీన రిలీజ్    

తెలుగు .. తమిళ భాషల్లో సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ వుంది. ఈ నేపథ్యంలో తమిళంలో ఆమె 'కరు' అనే హారర్ థ్రిల్లర్ చేసింది. నాగశౌర్య .. సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా కథ, ఓ చిన్నపిల్ల చుట్టూ తిరుగుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను, 'కణం' పేరుతో ఎన్వీ ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తెలుగులో విడుదల తేదీలను ఇప్పటికే కొన్నిమార్లు మార్చుకుంటూ వచ్చారు. తాజాగా ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి వుంది. సాయిపల్లవికి తెలుగులో గల క్రేజ్ ఈ సినిమాకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.        

More Telugu News