Allu Arjun: షూటింగ్ పూర్తి .. కథానాయిక అనూతో బన్నీ సెల్ఫీ!

  • బన్నీ హీరోగా 'నా పేరు సూర్య' 
  • ఈ నెల 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • మే 4వ తేదీన సినిమా రిలీజ్  

అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య' చిత్రం రూపొందుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అనూ ఇమ్మాన్యుయేల్ కోరిక మేరకు బన్నీ ఒక సెల్ఫీ తీసిచ్చాడు. షూటింగ్ చివరి రోజున చివరి షాట్ లో ఈ సెల్ఫీ తీయడం జరిగింది.

బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా చేసిన ఈ సినిమా, దేశభక్తి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 22వ తీదీన ఆడియో వేడుకను నిర్వహించి .. 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. మే 4వ తేదీని విడుదల తేదీగా నిర్ణయించారు. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇది ఫస్టు మూవీ కావడంతో, ఈ సినిమా ఆయనకి ఓ పరీక్ష వంటిదేనని చెప్పుకోవాలి.     

More Telugu News