nagashourya: నాగశౌర్య మూవీ నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • నాగశౌర్య హీరోగా 'అమ్మమ్మ గారిల్లు'
  • హీరోయిన్ గా షాలిని 
  • భారీ రేటుకు శాటిలైట్ హక్కులు

నాగశౌర్య కథానాయకుడిగా సుందర్ దర్శకత్వంలో 'అమ్మమ్మ గారిల్లు' చిత్రం రూపొందింది. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, టీజర్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

గతంలో 'ఓయ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన షామిలి, ఈ సినిమాలో కథానాయికగా నటించింది. టైటిల్ ని బట్టే కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని తెలుస్తోంది. విడుదలకి ముందే ఈ సినిమా శాటిలైట్ హక్కులు 2.75 కోట్లకి అమ్ముడయ్యాయి. ఇక ఆడియో హక్కుల కోసం ఆదిత్య మ్యూజిక్ వారు భారీ మొత్తం చెల్లించడం విశేషం.        

More Telugu News