nagashourya: 'ఛలో' తెచ్చిన ఉత్సాహంతో 'నర్తనశాల'

  • నాగశౌర్య హీరోగా 'నర్తనశాల'
  • దర్శకుడిగా శ్రీనివాస చక్రవర్తి పరిచయం 
  • వచ్చేనెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్

నాగశౌర్య సొంత బ్యానర్ పై తెరకెక్కిన 'ఛలో' భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తెచ్చిన లాభాలతో .. ఇచ్చిన ఉత్సాహంతో మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకి 'నర్తనశాల' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వచ్చేనెల 12వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు.

శ్రీనివాస చక్రవర్తి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'ఛలో' సినిమాకి సంగీతాన్ని అందించి మంచి మార్కులు కొట్టేసిన సాగర్ ను .. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందే ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకునే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సొంత సినిమాతో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు నాగశౌర్య చేతిలో ఉండటం విశేషం.    

More Telugu News