nagashourya: 50 రోజులు పూర్తిచేసుకున్న 'ఛలో' .. రెండోవారం నుంచే లాభాలు

  • 'ఛలో'తో హిట్ కొట్టిన నాగశౌర్య
  • మొదటివారంలోనే వచ్చేసిన పెట్టుబడి
  • దర్శకుడికి భారీ ఆఫర్లు

నాగశౌర్య - రష్మిక మందన జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఛలో' సినిమా, తాజాగా 45 సెంటర్స్ లో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఒక సినిమా ఒక వారం ఆడటమే కష్టంగా వున్న నేటి పరిస్థితుల్లో, ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడం నిజంగా విశేషమే. 6 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, 24 కోట్లకి పైగా గ్రాస్ ను .. 12.5 కోట్ల షేర్ ను రాబట్టి ఆశ్చర్యచకితులను చేసింది.

 మొదటివారంలోనే పెట్టుబడిని వెనక్కి తెచ్చేసి .. రెండవ వారం నుంచే లాభాలను తీసుకొస్తోంది. ఈ సినిమా సక్సెస్ తో హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడికి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దర్శకుడు వెంకీ కుడుములకి పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక నాగశౌర్య .. రష్మిక మందనలకు కూడా వరుస అవకాశాలు వస్తుండటమే ఇందుకు నిదర్శనం.     

More Telugu News