Lok Sabha: మారని కేంద్రం వైఖరి.. ప్రారంభమైన నిమిషానికే లోక్ సభ వాయిదా

  • ఆందోళనలు చేపట్టిన టీఆర్ఎస్, అన్నాడీఎంకే
  • వెల్ లోకి దూసుకెళ్లి నిరసనలు
  • మధ్యాహ్నం 12 వరకు సభ వాయిదా

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాసంపై లోక్ సభలో చర్చను చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభమైన వెంటనే గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోకి వెళ్లి ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. సభను కొనసాగనివ్వాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరినప్పటికీ వారు శాంతించలేదు. దీంతో, ప్రారంభమైన నిమిషానికే మధ్యాహ్నం 12 గంటల వరకు సభను స్పీకర్ వాయిదా వేశారు.

More Telugu News