Pakistan: సరిహద్దులో కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్‌.. ఐదుగురు పౌరుల మృతి

  • జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో కాల్పులు
  • మృతుల్లో ఓ మహిళ, ముగ్గురు చిన్నారులు 
  • దీటుగా బదులిస్తోన్న భారత ఆర్మీ

భారత సైన్యం ఎన్ని సార్లు గట్టిగా బుద్ధి చెప్పినా దాయాది పాకిస్థాన్ తన తీరు మార్చుకోవడం లేదు. సరిహద్దుల వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారని అధికారులు చెప్పారు. అందులో ఓ మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా జనావాస ప్రాంతాలపై కాల్పులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. పాక్ కాల్పులకు భారత ఆర్మీ దీటుగా బదులిస్తోందని అన్నారు. 

More Telugu News