abu salem: యూపీ సీఎం ఆదిత్యనాథ్ కి లేఖ రాసిన మాఫియా డాన్ అబూ సలేం

  • ఇతరుల ఆస్తులు గుంజుకునే మాఫియాడాన్ రక్షణ కోసం లేఖ
  • తీహార్ జైలు నుంచి లేఖ రాసిన మాఫియా డాన్ అబూ సలేం
  • తన పూర్వీకుల ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన

బెదిరింపులు, భయ బ్రాంతులకు గురిచేసి ఇతరుల ఆస్తులు గుంజుకునే మాఫియా డాన్ తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాయడం ఆసక్తి రేపుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాద్ కు తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మాఫియా డాన్‌ అబూసలేం లేఖ రాశాడు. ఆ లేఖలో అజంగఢ్‌ జిల్లాలోని తన పూర్వీకుల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. వాటికి రక్షణ కల్పించాలని యోగిని కోరాడు. యోగితో పాటు జిల్లా జడ్జి , ఎస్పీలకు కూడా అబూ సలేం లేఖలు రాయడం విశేషం.

 దీనిపై ఆయన న్యాయవాది రాజేష్‌ సింగ్‌ మాట్లాడుతూ, అబూ సలేం పూర్వీకుల ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని గతంలో ఫిర్యాదు చేశామని, వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో నిందితులపై తామే సెక్షన్‌ 156 కేసు పెట్టామని తెలిపారు. 2013 భూ రికార్డుల ప్రకారం ఆ భూమికి సలేం, అతని సోదరుడు యజమానిగా ఉన్నారని, 2017లో రికార్డులు పరిశీలించగా, యజమాని పేరు మార్చేసి ఉందని ఆయన చెప్పారు. దీంతోనే సలేం సీఎం లేఖలు రాశారని అన్నారు.

More Telugu News