sbi: ఎస్ బీఐ ఖాతాదారులకు ఊరట... కనీస నిల్వ లేకపోతే ఇకపై చార్జీలు స్వల్పమే

  • గరిష్ట చార్జీలు రూ.50 నుంచి రూ.15కు...
  • కనిష్ట చార్జీలు రూ.40 నుంచి రూ.10కి తగ్గింపు
  • ఏప్రిల్ 1 నుంచి అమలు

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాదారులకు భారీ ఊరట లభించింది. ఖాతాల్లో కనీస బ్యాలన్స్ లేకపోతే విధించే చార్జీలను బ్యాంకు 75 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ చార్జీలు రూ.50గా ఉండగా, ఇకపై రూ.15గా అమలవుతుంది. దీనికి జీఎస్టీ అదనం. కనీస నిల్వలో 75 శాతానికి పైగా లేకపోతేనే ఈ చార్జీ వర్తిస్తుంది. ఒకవేళ 50 శాతానికంటే తక్కువగా ఉంటే అప్పుడు చార్జీ రూ.10 మాత్రమే. సెబీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో గరిష్టంగా (75 శాతానికి పైగా బ్యాలన్స్ లేని సందర్భంలో) ఉన్న రూ.40 చార్జీ రూ.12, రూ.10కి తగ్గించడం జరిగింది. ఈ చార్జీలకు జీఎస్టీ అదనం. అలాగే ఈ శాఖల్లో కనిష్ట చార్జీలు అంటే బ్యాలన్స్ లో కేవలం 50 శాతం అంతకంటే తక్కువ ఉన్న సందర్భాల్లో విధించే చార్జీలు రూ.7.50, రూ.5కు తగ్గాయి. సవరించిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చార్జీల తగ్గింపుతో 25 కోట్ల కస్టమర్లకు ఉపశమనం కలగనుంది. ఏడాది క్రితమే సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ లను పెంచుతూ, వీటి నిర్వహణలో విఫలమైతే నెలవారీ జరిమానాలను బ్యాంకు నిర్ణయించిన విషయం విదితమే. 

More Telugu News