xiaomi: రేపట్నుంచి షియోమీ రిపబ్లిక్ డే సేల్...రూ. 4999కి రెడ్‌మీ 5ఏ

  • జ‌న‌వ‌రి 26 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న సేల్‌
  • ప‌వ‌ర్ బ్యాంకులు, ఇత‌ర యాక్స‌సెరీస్‌పై కూడా ఆఫ‌ర్లు
  • మొబీక్విక్‌తో చెల్లించిన వారికి 30 శాతం క్యాష్‌బ్యాక్

త‌మ అధికారిక వెబ్‌సైట్‌లో జ‌న‌వ‌రి 24 నుంచి జ‌న‌వ‌రి 26 వ‌ర‌కు రిప‌బ్లిక్ డే ప్ర‌త్యేక సేల్ జ‌ర‌గ‌నుంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, ప‌వ‌ర్ బ్యాంకులతో పాటు ఇత‌ర మొబైల్ యాక్స‌సెరీస్‌లపై భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌నుంది. ఈ సేల్‌లో రెడ్‌మీ 5ఏ ప్ర‌త్యేక సేల్‌ను కూడా నిర్వ‌హించనుంది. రూ. 4999గా రెడ్‌మీ 5ఏ ధ‌ర‌ను షియోమీ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

వీటితో మొబీక్విక్ ద్వారా రూ. 4000కి పైగా చెల్లించి కొనుగోలు చేసిన వారికి 30 శాతం సూప‌ర్‌క్యాష్ రూపంలో క్యాష్‌బ్యాక్‌, హంగామా ప్లే స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా అంద‌జేస్తున్న‌ట్లు ఎమ్ఐ.కామ్‌లో ఉంది. అంతేకాకుండా రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 డిస్కౌంట్ కూప‌న్ల అమ్మ‌కాల‌ను కూడా ఈ సేల్‌లో కొనుక్కుని ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఇక ధ‌ర‌ల విష‌యానికి వ‌స్తే షియోమీ ఎమ్ఐ ఏ1 - రూ. 13,999, ఎమ్ఐ మిక్స్2 - రూ. 32,999, రెడ్‌మీ నోట్ 4 - రూ. 9,999, రెడ్‌మీ 4 - రూ. 6,999, రెడ్‌మీ వై1 - రూ. 8,999, రెడ్‌మీ వై1 లైట్ - రూ. 6,999ల‌కు ల‌భించ‌నున్నాయి. ఇవే కాకుండా కార్ చార్జ‌ర్లు, బ్యాట‌రీలు, ఇయర్‌ఫోన్ల‌పై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి.

More Telugu News