chaitu: రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన 'శైలజా రెడ్డి అల్లుడు'

  • మారుతి దర్శకత్వంలో చైతు 
  • కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ 
  • ఈ రోజు నుంచి షూటింగ్ మొదలు  

మారుతి దర్శకత్వంలో చైతూ కథానాయకుడిగా ఒక సినిమా తెరకెక్కనుంది. సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా, ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకి 'శైలజా రెడ్డి అల్లుడు' టైటిల్ ను ఖరారు చేశారు.

 అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, చైతూ అత్తగా రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. హీరో .. హీరోయిన్ల పాత్రలను చాలా కొత్తగా మారుతి మలిచాడట. వాళ్ల మధ్య 'ఇగో'ను ప్రధానంగా చేసుకుని ఆయన నడిపించే కథా కథనాలు చాలా ఆసక్తికరంగా వుంటాయని అంటున్నారు. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతుండటం విశేషం.   

More Telugu News