nani: 'మిడిల్ క్లాస్ అబ్బాయి' విషయంలో ఆలోచనలో పడిన దిల్ రాజు!

  • నాని - భూమిక సీన్స్ కి ప్రాధాన్యత 
  • హీరో.. హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ తగ్గింపు
  • ఆ విషయంలోనే ఆడియన్స్ అసంతృప్తి

క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని ఇటీవలే 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని .. సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసిన దిల్ రాజు ఆలోచనలో పడ్డారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని - భూమిక మధ్య సీన్స్ హైలైట్ అవుతాయని భావించారట. అందువలన ఆ సీన్స్ కి ప్రాధాన్యతనిచ్చి, నాని - సాయిపల్లవి మధ్య గల నాలుగు రొమాంటిక్ సీన్స్ ను లేపేశారట.

ఆ ఎఫెక్ట్ కథపై బాగానే పడిందనే టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలైన తరువాత, హీరో .. హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ కాస్త ఘాటుగా ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అనుకుంటూ ఉండటంతో, దిల్ రాజు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అనవసరంగా ఆ సీన్స్ ను లేపేశామని ఆయన చాలా ఫీలవుతున్నారట. కట్ చేసిన ఆ సీన్స్ ను ఆయన యాడ్ చేస్తారా .. లేదా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దిల్ రాజు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.           

More Telugu News