jawan movie: 'జవాన్' సినిమా నిర్మాతను బెదిరించిన కేసులో ముగ్గురి అరెస్ట్

  • డబ్బిస్తే పైరసీ కాకుండా ఆపుతామంటూ బెదిరింపు
  • సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత
  • నిందితుల అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'జవాన్' సినిమా నిర్మాత కె.కృష్ణయ్యను బెదిరించిన కేసులో ముగ్గురు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ చౌదరి, ప్రభాకర్ చౌదరి, నాగ్ పూర్ నివాసి యార్లగడ్డ విజయ్ లు కృష్ణయ్యను కలిశారు.

 పైరసీ విషయంలో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని... కోరినంత డబ్బు ఇస్తే, ఇంటర్నెట్ లో ఈ సినిమా అప్ లోడ్ కాకుండా ఆపుతామని చెప్పారు. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో, వారు బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో, వీరిపై సీసీఎస్ పోలీసులకు నిర్మాత ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, నిందితులను హైదరాబాదులోని యూసఫ్ గూడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని రిమాండ్ కు తరలించారు. 

More Telugu News