love: భువనగిరి రైల్వే స్టేష‌న్‌లో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

  • ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కాళ్ల మండ‌లం కోప‌ల్లి నుంచి వచ్చిన ప్రేమికులు ‌
  • పురుగుల మందు తాగిన వైనం
  • ఆసుప‌త్రికి త‌రలింపు
  • ధ‌నుంజ‌య్ (20), కోమ‌లి (17) గా గుర్తింపు

రైల్వేస్టేష‌న్‌లో ఓ ప్రేమజంట ఆత్మ‌హ‌త్యాయత్నం చేసి క‌ల‌క‌లం రేపారు. భువ‌న‌గిరి రైల్వేస్టేష‌న్‌కి వ‌చ్చిన ఓ అమ్మాయి, అబ్బాయి రైలు దిగాక‌ తమతో తెచ్చుకున్న పురుగుల మందును తాగేసి ప‌డిపోయారు. ఈ విష‌యాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వారిని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌రలించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రేమ జంట ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కాళ్ల మండ‌లం కోప‌ల్లి నుంచి భువ‌న‌గిరికి వచ్చారని గుర్తించారు. వారిని ధ‌నుంజ‌య్ (20), కోమ‌లి (17) గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News