Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'అనుకున్నవన్నీ జరగవు' అంటున్న త్రిష 
  • మహేష్ సినిమా నుంచి కెమెరా మేన్ ఔట్!
  • ఫిబ్రవరికి 'చలో' అంటున్న నాగశౌర్య 
  • హిట్ చిత్రానికి రెండో సీక్వెల్ వస్తోంది!

*  జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు.. అంటోంది చెన్నయ్ బ్యూటీ త్రిష. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా కథానాయికగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మాట్లాడుతూ, 'మనం ఎన్నో అనుకుంటూ వుంటాం. అయితే, అన్నీ నిజమవ్వవు. కొన్ని అవుతాయి, కొన్ని కావు. దానికి అప్సెట్ అవకూడదు, అంతా మన మంచికే జరిగిందిలే అనుకోవాలి" అంటూ వేదాంతం చెబుతోంది.    
*  మహేష్ బాబు హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న 'భరత్ అనే నేను' చిత్రం నుంచి కెమెరా మేన్ రవి కె.వర్మన్ తప్పుకున్నాడు. దీంతో కొత్తగా తిరు జాయిన్ అయ్యాడు. గతంలో తిరు 'జనతా గ్యారేజ్' చిత్రానికి పనిచేశాడు. రవి ఈ ప్రాజక్టు నుంచి తప్పుకోవడానికి కారణాలు తెలియరాలేదు.      
*  నాగశౌర్య హీరోగా నటించిన 'చలో' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక మండన కథానాయికగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.  
*  గతంలో వచ్చిన 'దండుపాళ్యం' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా 'దండుపాళ్యం 2' తీయగా, అది కూడా విజయం సాధించింది. దీంతో తాజాగా 'దండుపాళ్యం 3'ని కూడా నిర్మిస్తున్నారు. శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

More Telugu News