journalist: త్రిపురలో దారుణ హత్యకు గురైన మ‌రో జర్న‌లిస్టు!

  • త్రిపురలో దారుణ ఘ‌ట‌న
  • జ‌ర్న‌లిస్టుని కాల్చి చంపిన భద్రతాసిబ్బంది
  • చిన్నపాటి గొడ‌వే కార‌ణం

త్రిపురలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అదే రాష్ట్రంలో ఇటీవ‌ల ఓ జ‌ర్నలిస్టు హ‌త్య‌కు గురైన విష‌యాన్ని మ‌ర్చిపోక‌ముందే మరో జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. అక్క‌డి స్యందన్‌ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టు సుదీప్‌ దత్త భౌమిక్ ఈ రోజు త్రిపుర రాష్ట్రీయ రైఫిల్స్‌(టీఎస్ఆర్‌) సెకండ్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ను కలిసేందుకు వెళ్లాడు. అందు కోసం ఆయ‌న ముందే అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాడు.

అయితే, కమాండెంట్ కార్యాల‌యానికి వ‌చ్చిన ఆ జ‌ర్న‌లిస్టుని భద్రతాసిబ్బందికి చెందిన తపన్‌ దేవర్మ అనే పోలీస్ అడ్డుకుని వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ చెల‌రేగింది. కోపంతో ఊగిపోయిన తపన్‌ తన దగ్గరున్న తుపాకీతో సుదీప్‌ను కాల్చి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.  

More Telugu News