revant reddy: ఓటుకు నోటు వంటి అక్ర‌మ‌కేసుల్లో నన్ను ఇరికించారు!: రేవంత్ రెడ్డి

  • ప్ర‌శ్నిస్తే గొంతునొక్క‌డం, అసెంబ్లీలో స‌స్పెన్ష‌న్లు చేయ‌డం నిత్య‌కృత్యాలు అయ్యాయి
  • నాపై క‌క్ష‌క‌ట్టి అక్ర‌మ‌కేసుల్లో ఇరికించారు
  • కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే గొంతునొక్క‌డం, అసెంబ్లీలో స‌స్పెన్ష‌న్లు చేయ‌డం నిత్య‌కృత్యాలు అయిపోయాయ‌ని రేవంత్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌నపై క‌క్ష‌క‌ట్టి ఓటుకు నోటు వంటి అక్ర‌మ‌కేసుల్లో ఇరికించార‌ని అన్నారు. జైల్లో పెట్టిన సంద‌ర్భంలోనూ తాను వెన‌క‌డుగువేయ‌లేద‌ని అన్నారు. త‌న కూతురి నిశ్చితార్థానికి కొన్ని గంట‌ల ముందు మాత్ర‌మే న్యాయ‌స్థానం త‌న‌కు అనుమ‌తి ఇచ్చింద‌ని పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయిపోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ హితం కోసం తాను ఉద్ధృతంగా పోరాడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని చెప్పారు.

More Telugu News