Jagan Mohan Reddy: యుగ‌ పురుషుడు ఎన్టీఆర్‌తో ఏ1 ముద్దాయి అయిన జ‌గ‌న్ తనను తాను పోల్చుకోవ‌డం స‌రికాదు: య‌న‌మ‌ల‌

  • అప్ప‌ట్లో ఎన్టీఆర్ ఒక్క‌రే వాకౌట్ చేశారు  
  • జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్ర‌జాస్వామ్యంపై గౌర‌వం లేదు
  • అసెంబ్లీ బ‌హిష్క‌ర‌ణ నిర్ణయం తీసుకుని మ‌రో త‌ప్పిదం చేశారు
  • కోర్టులు, అసెంబ్లీ నుంచి త‌ప్పించుకునేందుకే జ‌గ‌న్ పాద‌యాత్ర

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్ర‌జాస్వామ్యంపై గౌర‌వం లేదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... జ‌గ‌న్‌కు చ‌ట్ట‌స‌భ‌ల‌పై కూడా గౌర‌వం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బ‌హిష్క‌ర‌ణ నిర్ణయం తీసుకుని జ‌గ‌న్ మ‌రో త‌ప్పిదం చేశార‌ని అన్నారు. కోర్టులు, అసెంబ్లీ నుంచి త‌ప్పించుకునేందుకే జ‌గ‌న్ పాద‌యాత్ర పేరుతో నాట‌కం ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు.


 గ‌తంలో ఎన్టీఆర్ కూడా అసెంబ్లీని బ‌హిష్క‌రించార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారని, అయితే, యుగ‌పురుషుడు ఎన్టీఆర్‌తో ఏ1 ముద్దాయి జ‌గ‌న్ తనను తాను పోల్చుకోవ‌డం స‌రికాదని అన్నారు. అప్పుడు ఎన్టీఆర్ ఒక్క‌రే వాకౌట్ చేశారని, ఎమ్మెల్యేలు స‌భ‌కు హాజ‌ర‌య్యారని వివ‌రించారు. జ‌గ‌న్ తీరు న‌చ్చ‌కపోవడంతోనే వైసీపీ నేత‌లు పార్టీలు మారుతున్నార‌ని, ఈ పాద‌యాత్ర‌తో జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు కూడా దూర‌మ‌వుతారని య‌న‌మ‌ల అన్నారు.

More Telugu News