aadi saikumar: నా సినిమా రిలీజ్ అయినప్పుడు సందీప్ కిషన్ ను థియేటర్ కు తీసుకెళతా : ఆది సాయికుమార్

  • ఆది సాయికుమార్ తాజా చిత్రంగా 'నెక్స్ట్ నువ్వే' 
  • చిన్నప్పటి నుంచి సందీప్ కిషన్ తో ఫ్రెండ్షిప్ 
  • ఇద్దరికీ హీరోలవుదామనే కోరిక ఉండేది 
  • సందీప్ మంచి విమర్శకుడు కూడా  

ఆది సాయికుమార్ తాజా చిత్రంగా 'నెక్స్ట్ నువ్వే' సినిమా తెరకెక్కింది. వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ఐ డ్రీమ్స్ తో పంచుకున్నాడు. "ఇండస్ట్రీలో మీకు మంచి స్నేహితుడెవరు?" అనే ప్రశ్నకు ఆయన సందీప్ కిషన్ పేరు చెప్పాడు.

"చిన్నప్పటి నుంచి సందీప్ .. నేను మంచి స్నేహితులం. మా ఇద్దరికీ కూడా హీరోలు అవ్వాలని వుండేది. ఇద్దరి ఐడియాలజీ కలవడంతో మంచి స్నేహితులమయ్యాం. ఇద్దరం కలిసే చెన్నైలో డాన్స్ క్లాస్ లకి .. జిమ్నాస్టిక్స్ కి .. జిమ్ కి వెళుతూ ఉండేవాళ్లం. అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతూనే వుంది. నా సినిమా రిలీజ్ అయితే సందీప్ కిషన్ నే తీసుకెళతా. సందీప్ మంచి క్రిటిక్ .. సినిమా బాగా లేకపోతే ఆ విషయాన్ని ముఖం మీదే చెప్పేస్తాడు. ఇలా చెయ్యొద్దు .. అలా చెయ్యొద్దు అని సలహాలు .. సూచనలు ఇస్తుంటాడు" అని ఆది సాయికుమార్ చెప్పుకొచ్చాడు.    

More Telugu News