revant reddy: అసెంబ్లీలో టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేసి, తాళం వేసుకెళ్లిన రేవంత్ రెడ్డి!

  • కంప్యూటర్లను తీసుకెళ్లిన రేవంత్ అనుచరులు
  • నేడు అదే గదిలో ఎల్పీ సమావేశాన్ని పెట్టాలనుకున్న రేవంత్
  • అపై మనసు మార్చుకున్న నేత

గడచిన ఏడాదిన్నరగా హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్న తెలుగుదేశం పార్టీ చాంబర్ ను రేవంత్ రెడ్డి ఖాళీ చేశారు. ఈ ఉదయం అసెంబ్లీ కార్యాలయానికి వచ్చిన రేవంత్ అనుచరులు, అక్కడి కంప్యూటర్లు, విలువైన ఫైళ్లను తరలించారు. ఆపై ఆ గదికి తాళం వేసి తాళం చెవులు తమ వెంట తీసుకెళ్లారు. ఈ ఉదయం అదే గదిలో తెలుగుదేశం శాసనసభాపక్ష పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టిన రేవంత్ రెడ్డి, ఆపై తన అనుయాయుల కోరిక మేరకు ఆ ఆలోచనను విరమించుకున్న సంగతి తెలిసిందే. 

More Telugu News