manchu vishnu: యూఎస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఆచారి అమెరికా యాత్ర'

  • మంచు విష్ణు తాజా చిత్రంగా 'ఆచారి అమెరికా యాత్ర'
  • నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మూడవ సినిమా 
  • కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ 
  • కీలక పాత్రలో బ్రహ్మానందం  

మొదటి నుంచి కూడా మంచు విష్ణు యాక్షన్ .. ఎమోషన్ .. రొమాంటిక్ కామెడీకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ తరహా సినిమాలు ఆయనకి సక్సెస్ లు తెచ్చిపెడుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఆయన జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా చేస్తున్నాడు.

టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమాను ఎక్కువగా అమెరికాలో చిత్రీకరిస్తూ వస్తున్నారు. తాజాగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఆశించిన స్థాయిలో అవుట్ పుట్ రావడంతో యూనిట్ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంచు విష్ణుతో నాగేశ్వర రెడ్డి చేసిన 'దేనికైనా రెడీ' మంచి మార్కులు తెచ్చుకోగా .. 'ఈడో రకం ఆడో రకం' హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న మూడవ సినిమా ఇది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, బ్రహ్మానందం ఓ కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.     

More Telugu News