Tapsi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • స్టార్ ఇమేజ్ పై తాప్సీ మదిలో సందేహం 
  • 'సువర్ణ సుందరి' పాత్రలో జయప్రద 
  • 'నెక్స్ట్ నువ్వే' సెన్సార్ పూర్తి 
  • నవంబర్ 3న నయనతార 'కర్తవ్యం'

*  తనకి బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ వచ్చిందో లేదో తెలియడం లేదని అంటోంది అందాల నాయిక తాప్సీ. ఇటీవల విడుదలైన 'జుడ్వా 2' సూపర్ హిట్ అవడంతో తాప్సీకి బాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగింది. అయినప్పటికీ తనకి స్టార్ ఇమేజ్ వచ్చిందా? రాలేదా? అన్న విషయంలో ఈ ముద్దుగుమ్మలో సందేహం వుందట. ఏదైనా అవార్డు వేడుకకి వెళితే, అక్కడ తనని గుర్తు పడతారా? లేదా? అన్న డౌట్ వస్తుంటుందని, అందుకే మరిన్ని హిట్స్ ఇచ్చి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నానని చెప్పింది.
*  ప్రముఖ నటి జయప్రద ప్రధాన పాత్రదారిగా 'సువర్ణ సుందరి' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఇది చారిత్రాత్మక కథతో తెరకెక్కుతోందని చిత్ర దర్శకుడు సూర్య తెలిపారు. ఇందులో యువనటి పూర్ణ మరో కీలక పాత్రలో నటిస్తోంది.
*  ఆది సాయికుమార్ హీరోగా ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన 'నెక్స్ట్ నువ్వే' చిత్రం సెన్సార్ పూర్తయింది. చిత్రాన్ని నవంబర్ 3న దీనిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వైభవి, రష్మి హీరోయిన్లుగా నటించారు.  
*  నయనతార తమిళంలో నటించిన 'ఆరం' చిత్రాన్ని తెలుగులోకి 'కర్తవ్యం' పేరిట అనువదించారు. తెలుగు, తమిళ వెర్షన్లను నవంబర్ 3న ఒకేసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో నయన్ జిల్లా కలెక్టర్ గా నటించింది.   

More Telugu News