chiranjeevi: 'సైరా'కు రెహమాన్ గుడ్ బై చెప్పేసినట్టేనా?

  •  సెట్స్ పైకి వెళ్లే పనుల్లో 'సైరా నరసింహా రెడ్డి'
  •  సంగీత దర్శకుడిగా రెహ్మాన్ ఎంపిక
  •  తీరిక లేదని చెప్పిన రెహ్మాన్
  •  ఇతర ప్రాజక్టులతో బిజీ  

చిరంజీవి 151వ సినిమాగా 'సైరా నరసింహా రెడ్డి' సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకుందామని అనుకున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి రావడంతో, జాతీయస్థాయి మార్కెట్ కోసం ఎ.ఆర్. రెహమాన్ ను ఎంపిక చేసుకున్నారు.

 అయితే రెహమాన్ ఈ సినిమా చేస్తున్నాడా? లేదా? అనే విషయంలో కొన్ని రోజులుగా ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టేననేది తాజా సమాచారం. సహజంగానే రెహ్మాన్ ఏ ప్రాజెక్టుకైనా ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ ఉంటాడు. అందువల్లనే తక్కువ సినిమాలను అంగీకరిస్తూ ఉంటాడు. ఇంతకుముందే ఆయన 'బ్రూస్ లీ' బయోపిక్ కు సైన్ చేయడం వలన, 'సైరా'కు చేయలేనని చెప్పినట్టు సమాచారం.

More Telugu News